వేడిని తగ్గించేందుకే షిండే ప్రకటన : కడియం శ్రీహరి

న్యూఢిల్లీ : అఖిలపక్ష సమావేశంలో వేడిని తగ్గించేందుకు మాత్రమే హోంమంత్రి షిండే ప్రకటన చేసినట్లు ఉందని తెదేపా నేత కడియం శ్రీహరి విమర్శించారు. అఖిలపక్ష భేటీలో కేంద్ర ప్రభుత్వ విధానాన్ని చెప్పాల్సిందిగా తాము కోరినట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి తెలంగానకు అనుకూలమని షిండే చెప్పలేదని ఆయన తెలియజేశారు.