శబరిమల అయ్యప్ప ఆలయ అర్చకుడిపై సుప్రీంలో పిటిషన్‌

న్యూఢిల్లీ,జనవరి3(జ‌నంసాక్షి): శబరిమలలోని అయ్యప్పస్వామి ఆలయ అర్చకుడిపై సుప్రీంకోర్టులో పిటిషన్‌
దాఖలైంది. బుధవారం 50 ఏళ్లలోపు మహిళలు అయ్యప్పను దర్శించుకున్న నేపథ్యంలో ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేసి సంప్రోక్షణ చేసిన అనంతరం ఆలయాన్ని తెరవడంపై ఓ న్యాయవాది  సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే సుప్రీంకోర్టు మహిళలను శబరిమల ఆలయంలోకి అనుమతించిన విషయం తెలిసిందే..ఈ క్రమంలో సుప్రీంకోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా అర్చకుడు వ్యవహరించారని ఆరోపిస్తూ న్యాయవాది పిటిషన్‌ దాఖలు చేశారు.