శబరి ఘటనలపై అరవిూసంతో వ్యక్తి  నిరసన

తిరువనంతపురం,జనవరి3(జ‌నంసాక్షి): శబరిమల ఆలయంలోకి ఇద్దరు మహిళలు ప్రవేశించడంపై ఓ వ్యక్తి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశాడు. రాజేశ్‌ ఆర్‌ కురుప్‌ అనే వ్యక్తి సగం విూసం గీయించుకొని నిరసన చేపట్టాడు. ఆర్‌ ఎస్‌ ఎస్‌ మద్దతుదారుడైన రాజేశ్‌.. ఇటీవలే ఫేక్‌ ఫోటోలు తయారు చేసి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. రాజేశ్‌ అయ్యప్ప మాల ధరించినట్లు, తలపై ఇరుముడి పెట్టుకున్నట్లు, ఆయనను ఓ పోలీసు తన్నినట్లు ఫోటోలు తయారు చేసి ఫేస్‌ బుక్‌ లో పోస్టు చేశాడు. ఈ విషయాన్ని సీరియస్‌ గా తీసుకున్న పోలీసులు రాజేశ్‌ ను అరెస్టు చేశారు. తాజాగా బిందు, కనకదుర్గ అనే మహిళలు శబరిమల ఆలయంలోకి ప్రవేశించడంతో.. నిరసనగా సగం విూసం గీయించుకున్నాడు.