శాశ్వత పరిష్కారం కోసం కృషిచేస్తున్నారు: బొత్స

ఢిల్లీ : సున్నితమైన తెలంగాణ అంశం పై శాశ్వత పరిష్కారం కోసం కృషిచేస్తున్నారని పీసీసీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణ తెలిపారు. అధిష్ఠానం పిలుపు మేరకు ఢిల్లీ వెళ్లిన ఆయన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా తన అభిప్రాయం తెలుసుకోవడానికి పిలిచారని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ, యూపీఏ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు పీసీసీ అధ్యక్షునిగా కట్టుబడి ఉంటారని బొత్స తెలిపారు. అధిష్ఠానానికి చెప్పిన అభిప్రాయాలు మీడియాకు చెప్పడం భావ్యంకాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నెల 15,16 తేదీల్లో రాహుల్‌గాంధీ ఏర్పాటు చేసిన పీసీసీ, సీఎల్పీ సమావేశానికి హాజరవుతానని బొత్స సత్యనారాయణ చెప్పారు.