శ్రీశైలం ఆలయానికి పోటెత్తిన భక్తులు

కర్నూలు,నవంబర్‌22(జనం సాక్షి):  శ్రీశైలం మల్లన్న ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు పోటెత్తారు. కార్తిక సోమవారం సందర్భంగా మలన్న ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. వేకువ జామునుంచే పాతాళగంగలో తెల్లవారుజాము నుంచే భక్తుల పుణ్యస్నానాలు చేసి గంగాధర మండపం, ఆలయ ఉత్త మాడ వీధిలో కార్తీక దీపాలు వెలిగిస్తున్నారు. స్వామివారి అలంకార దర్శనానికి అధికారులు అనుమతించారు. దీంతో భక్తులు మల్లికార్జునస్వామి, అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి దర్శనానికి సుమారు 3 గంటల సమయం పడుతుంది. భక్తుల ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఆలయ అధికారులు తెలిపారు.