సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి.

ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సూచించారు.మౌలాలి డివిజన్ పరిధిలోని క్రియేటివ్ నగర్ కు చెందిన చంద్రకాంత్ కు దళిత బంధు ద్వారా మంజూరు అయిన దివిటీ రైస్ కిరాణా జనరల్ స్టోర్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.దళితులు ఆర్థికంగా ఎదగడానికి వారి జీవన ఉపాధి కొరకు ప్రవేశపెట్టిన దళిత బంధు పథకాన్ని సద్వినియోగం చేసుకొని నలుగురికి ఉపాధి అవకాశాలు కల్పించాలని అన్నారు.ఈకార్యక్రమంలో కార్పొరేటర్ ప్రేమ్ కుమార్,మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్,సతీష్ కుమార్, గుండా నిరంజన్,సత్తయ్య, ఆదినారాయణ,సంతోష్ నాయుడు, బాలకృష్ణ గుప్తా,మందభాస్కర్,గౌలీ కర్ శైలేందర్,దుర్గేష్,నవాబ్,రాజు,జానీ,నాగరాజు,గీత గుప్తా,జాన్బి,తోట నగేష్,పద్మ,ఆగమయ్య తదితరులు పాల్గొన్నారు.