సింగరేణి కార్మికులకు తీపికబురు

` దసరా బోనస్‌గా.. రూ.796 కోట్లు
` ఒక్కొక్కరికి రూ.లక్షా 90వేల అందనున్న మొత్తం
` తొలిసారిగా ఒప్పంద కార్మికులకూ రూ.5 వేలు
` వివరాలు వెల్లడిరచిన డిప్యూటి సీఎం భట్టి
హైదరాబాద్‌(జనంసాక్షి):సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దసరా పండుగకు ముందుగానే సింగరేణి కార్మికులకు బోనస్‌ ప్రకటిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తెలిపారు. అలాగే లాభాల్లో వాటా కూడా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ సింగరేణిది కీలక పాత్ర అని.. లాభాల్లో వాటాను దసరా ముందు కార్మికులకు అందిస్తున్నామన్నారు. కార్మికులకు ఒక్కొక్కరికి రూ.1.90 లక్షల చొప్పున ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి బోనస్‌ ప్రకటించారు. దసరా ముందు లాభాల్లో వాటా పంచి కార్మికుల కుటుంబాల్లో ఆనందం చూడాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. ఇందుకోసం రూ.796 కోట్లు కేటాయించామన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రతిపాదన మేరకు సింగరేణి కార్మికులకు బోనస్‌ ప్రకటిస్తున్నామన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లడంలో సింగరేణి కార్మికులు కీలక పాత్ర పోషించారు. సింగరేణి కార్మికులకు బోనస్‌ ఇవ్వాలనే ప్రతిపాదన వచ్చింది. దాంతో సింగరేణి కార్మికులకు దసరా బోనస్‌ ప్రకటిస్తున్నాం. దసరా కంటే ముందుగానే సింగరేణిలో లాభాల వాటా పంచడం ద్వారా కార్మికుల కుటుంబాల్లో ఆనందాన్ని చూడాలనుకున్నాం అని అన్నారు.  2023`24 ఏడాదిలో సింగరేణికి రూ.4,701 కోట్లు లాభం వచ్చిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఇందులో సింగరేణి కార్మికులకు రూ.796 కోట్లు బోనస్‌గా ప్రకటిస్తున్నట్టు చెప్పారు. సగటున ఒక్కో కార్మికుడికి రూ.1.90లక్షలు బోనస్‌ వస్తుందన్నారు. సింగరేణి కార్మికులకు సంతోషంగా బోనస్‌ ప్రకటిస్తున్నట్టు భట్టి విక్రమార్క తెలిపారు. ఒప్పంద ఉద్యోగులకు కూడా ఒక్కొక్కరికి రూ.5వేల చొప్పున ఇవ్వాలని నిర్ణయించినట్టు చెప్పారు. సింగరేణి లాభాల్లో 33 శాతం బోనస్‌గా ప్రకటించడం పట్ల కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతేడాది కంటే రూ.20వేలు అదనంగా బోనస్‌ ప్రకటించామని, సింగరేణి చరిత్రలో తొలిసారిగా ఒప్పంద ఉద్యోగులకూ బోనస్‌ ఇస్తున్నామని ప్రభుత్వం తెలిపింది. తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి సింగరేణి కార్మికులకు లాభాల్లో వాటాను దసరా బోనస్‌ గా ప్రకటించారు. అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రూ.4,701 కోట్ల రూపాయల్లో రూ.796 కోట్లను సింగరేణి కార్మికులకు పంచుతున్నాం. ఒక్కొక్క సింగరేణి కార్మికుడికి 1 లక్షా 90వేలు బోనస్‌ ఇస్తున్నాం. కాంట్రాక్టు కార్మికులకు ఒక్కొక్కరికి రూ.6 వేలు ఇస్తాం. కాంట్రాక్టు కార్మికులకు బోనస్‌ ఇవ్వడం ఇదే మొదటి సారి. గత ఏడాది కంటే 20 వేలు అధికంగా బోనస్‌ ఇచ్చాం. సింగరేణి లాభాల్లో 33 శాతం వాటాను కార్మికులకు బోనస్‌ గా అందిస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర సాధనలో సింగరేణి కార్మికులు సైతం తమ వంతు పాత్ర పోషించారని వ్యాఖ్యానించారు. సింగరేణి కార్మికులు ప్రభుత్వానికి తలమానికమని, సింగరేణి ఉత్పత్తిని పెంచుతూ ఇతర రాష్టాల్రకు కూడా బొగ్గు ఎగుమతి చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. సింగరేణిని విస్తరిస్తూ కొంత పెట్టుబడి పెట్టే నిర్ణయాన్ని కూడా తీసుకున్నామన్నారు.  సింగరేణిలో 25 వేల మంది కాంట్రాక్ట్‌ కార్మికులు ఉన్నారని.. తొలిసారిగా కాంట్రాక్ట్‌ కార్మికులకు కూడా బోనస్‌ ఇస్తున్నామన్నారు. కాంట్రాక్టు కార్మికులకు రూ.5వేలు బోనస్‌ అందిస్తామన్నారు. లాభాలు కార్మికులకు పంచుతున్నామన్నారు.ఇదిలావుంటే రద బాధితులను ఆదుకునేందుకు సింగరేణి ఉద్యోగులు పెద్ద మనసుతో ముందుకొచ్చారు. సింగరేణి కార్మికులు తమ ఒకరోజు వేతనం రూ.10.25 కోట్లను తెలంగాణ సీఎ సహాయనిధికి విరాళంగా ఇచ్చారు. హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డికి చెక్కును డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సింగరేణి కాలరీస్‌ వర్కర్క్‌ యూనియన్‌ అధ్యక్షుడు కూనంనేని సాంబశివరావు, సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం అధ్యక్షుడు సీతారామయ్య, ఐఎన్‌టీయూసీ జనరల్‌ సెక్రటరీ జనక్‌ ప్రసాద్‌, సింగరేణి సీఎండీ బలరాం, రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌లు సెప్టెంబర్‌ 19న కలిసి అందజేశారు. దాంతోపాటు కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సైతం రూ.2.50 లక్షలను వరద బాధితుల కోసం విరాళం అందించారని తెలిసిందే.
విస్తరణే లక్ష్యంగా…
సింగరేణి సంస్థ ఆర్జించిన లాభాలను భవిష్యత్‌ అవసరాలకు తగినట్లు పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. దాని ప్రకారం.. సోలార్‌ విద్యుదుత్పత్తి కేంద్రాన్ని 1000 మెగావాట్లకు విస్తరించడం, రామగుండంలో 500 మెగావాట్ల పంప్డ్‌ స్టోరేజ్‌ ప్లాంట్‌ నిర్మాణం, జైపూర్‌లోని ప్రస్తుత థర్మల్‌ విద్యుదుత్పత్తి కేంద్రంలో మరో 1లీ800 మెగావాట్ల సామర్థ్యం కల మరో థర్మల్‌ విద్యుదుత్పత్తి కేంద్రం, రామగుండంలో టీఎస్‌ జెన్‌ కో ఆధ్వర్యంలో మరో 1లీ800 మెగావాట్ల థర్మల్‌ విద్యుదుత్పత్తి కేంద్రం, ఒడిశాలోని నైనీ బ్లాక్‌పైన (పిట్‌హెడ్‌) 2,400 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సూపర్‌ క్రిటికల్‌ థర్మల్‌ విద్యుదుత్పత్తి కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ఉప ముఖ్యమంత్రి తెలిపారు. సంస్థ పరిధిలోని వీకే ఓపెన్‌ కాస్ట్‌, గోలేటీ, నైనీ ఓసీలను ప్రారంభిస్తామని, సింగరేణి కార్మికులు, ఉద్యోగుల పిల్లల కోసం నూతన రెసిడెన్షియల్‌ పాఠశాలలు, ఇంటిగ్రేటెడ్‌ స్కూల్స్‌, ఏరియా ఆసుపత్రుల ఆధునికీకరణతో పాటు హైదరాబాద్‌లో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని ఉప ముఖ్యమంత్రి వెల్లడిరచారు. విలేకరుల సమావేశంలో మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, దామోదర్‌ రాజనరసింహ, దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్‌, జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి,  జహీరాబాద్‌ ఎంపీ సురేశ్‌ షెట్కార్‌, సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేలు గడ్డం వినోద్‌, మక్కన్‌ సింగ్‌ రాజ్‌ ఠాకూర్‌, ప్రేమ్‌సాగర్‌రావు, సింగరేణి ఎండీ బలరాం, కార్మిక సంఘా ల నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య, జనక్‌ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.