సిరివెన్నల మృతికి చంద్రబాబు దిగ్భార్రతి

అమరావతి,నవంబర్‌30(జనం సాక్షి):  సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతి దిగ్భార్రతిని కలిగించిందని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన మృతి సినిమా రంగానికి తీరని లోటని ఆయన వ్యాఖ్యానించారు. అంచలంచలుగా ఎదిగిన ఆయన జీవితం నేటి యువతకు ఆదర్శమన్నారు. తన పాటలతో తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని చెప్పారు. మూడున్నర దశాబ్దాల సినీ జీవితంలో 3 వేలకు పైగా పాటలు రాసి కోట్లాది మంది ప్రేక్షకులను సిరివెన్నల ఆకట్టుకున్నారన్నారు. తన పాటలతో ప్రజలలో చైతన్యం తీసుకువచ్చారని, ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని చంద్రబాబు అన్నారు.