సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న జడ్పీ చైర్మన్

 జనం సాక్షి, మంథని : పెద్దపల్లి జిల్లా గ్రామీణ అభివృధ్ది శాఖ, ఉపాధి హమీ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో జిల్లా జెడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ హజరై కేక్‌ కట్‌ చేసి వేడుకలు ప్రారంభించారు. ఈ వేడుకల్లో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్‌ రఘువీర్‌సింగ్‌, కమాన్‌పూర్‌ ఏఎంసీ చైర్మన్‌ దాసరి రాయలింగు తో పాటు ఉద్యోగులు పాల్గొన్నారు.