సీతారాంపల్లి గ్రామంలో కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ

బిచ్కుంద ఫిబ్రవరి14 (జనంసాక్షి) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని బిచ్కుంద మండలంలో గల సీతారాంపల్లి గ్రామంలో మంగళవారం నాడు కళ్యాణ లక్ష్మీ చెక్కులను మాజీ జడ్పీటీసీ సంధి సాయిరాం అందజేసినారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డల పెండ్లిళ్లు భారం కావొద్దనే సీఎం కేసీఆర్‌ ఈ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. సీఎం కేసీఆర్‌ అభివృద్ధి, సంక్షేమ పథకాలతో రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్‌ వన్‌గా తీర్చిదిద్దుతున్నారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు సొసైటీ వైస్ చైర్మన్ సంగారెడ్డి, ఉప సర్పంచ్ రాములు తదితరులు ఉన్నారు.