సునీల్‌ మిట్టల్‌కు మినహాయింపునిచ్చిన సుప్రీంకోర్టు

ఢిల్లీ, జనంసాక్షి: అదనపు స్పెక్ట్రం కేటాయింపు కేసులో వ్యక్తిగత హాజరునుంచి భారతీ ఎయిర్‌టెల్‌ సీఈవో సునీల్‌ మిట్టల్‌కు సప్రీం కోర్టు మినహాయింపు ఇచ్చింది. మిట్టల్‌ అభ్యర్థనపై 4 వారాల్లోగా సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు సీబీఐని ఆదేశించింది.