సువర్ణ అవకాశాన్ని   నిరుద్యోగ యువత  ఫిబ్రవరి 11 న జరిగే జాబ్   మేళా ను  సద్వినియోగం చేసుకోవాలి : హస్తినాపురం డివిజన్ బా రాస అధ్యక్షులు అందోజు  సత్యం చారి 

 
  ఎల్బీనగర్ (జనం సాక్షి )  ఫిబ్రవరి 11 న సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం వెనుక ఉన్న గ్రౌండ్ నందు జరిగే జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని    హస్తినాపురం డివిజన్ బా రాస అధ్యక్షులు అందజే సత్యం చారి   పిలుపునిచ్చారు  .ఈ సందర్భంగా అందోజు సత్యం చారి  మాట్లాడుతూ ఎల్.బి.నగర్ శాసనసభ్యులు .దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర క్రిడాల శాఖ మంత్రి వర్యులు .శ్రీనివాస్ గౌడ్  సహాకారంతో ఫిబ్రవరి 11 న సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం వెనుక ఉన్న గ్రౌండ్ నందు జరిగే జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం ఉపయోగించుకోవాలని కోరారు.దాదాపు120 ప్రైవేట్ కంపెనీలు ఇట్టి కార్యక్రమంలో పాల్గొననున్నాయి అని తెలిపారు.ఉద్యోగం నందు అర్హత సాధించిన వారికి అదే రోజు నియామకపత్రాలు ఇవ్వడం జరుగుతుంది అని తెలిపారు.ఉద్యోగం లేదని చింత పడకుండా అట్టి శిబిరానికి రావాలని కోరారు.ఏడవ తరగతి నుంచి మొదలు పి.జీ.వరకు చదువుకున్న యువత ఇందులో పాల్గొనవచ్చు అని తెలిపారు.వికలాంగులు కూడా పాల్గొనవచ్చు అని తెలిపారు.అర్హతను బట్టి జీతం 15,000 వేల నుంచి ఒక లక్ష వరకు ఉంటుంది అని  అందోజు  సత్యం చారి  తెలిపారు.