సెంచరీ కోల్పోయిన హస్సీ
చెన్నై: ఐపీఎల్-6లో భాగంగా చెన్నై బ్యాట్స్మెన్ మైకెల్ హస్సీ సెంచరీ కోల్పోయాడు. ఐపీఎల్ ప్రారంభం నుంచి మెరుగ్గా అడుతున్న హస్సీ ఈ రోజు కోల్కతాతో జరుగుతున్న మ్యాచ్ 95పరుగుల వద్ద నరైస్ బౌలింగ్లో దాస్కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. 17 ఓవర్లు ముగిసే సమయానికి చెన్నై రెండు వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో రైనా, ధోనీ ఉన్నారు.