సోదరిపై అనుమానంతో స్నేహితుడి దారుణ హత్య
న్యూఢిల్లీ,సెప్టెంబర్24 జనం సాక్షి : అనుమానంతో తన సోదరి స్నేహితుడిని చంపేశాడు అన్న. ఈ దారుణ సంఘటన ఢిల్లీలోని పశ్చిమ్ విహార్ ఏరియాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ప్రశాంత్ అనే యువకుడు అనిల్ అనే వ్యక్తి సోదరితో సన్నిహితంగా ఉంటున్నాడు. ప్రశాంత్కు తన సోదరితో ఏదో సంబంధం ఉందని అనుమానించిన అనిల్.. అతడిని అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. దీంతో పని ఉందని ప్రశాంత్ను ఆదివారం రాత్రి బయటకు పిలిపించాడు అనిల్. ఆ తర్వాత పశ్చిమ్ విహార్కు సవిూపంలో ఉన్న రైల్వే ట్రాక్ వద్దకు ప్రశాంత్ను అనిల్ తీసుకెళ్లాడు. అక్కడే మాటువేసిన అనిల్ స్నేహితులు.. ప్రశాంత్పై విచక్షణారహితంగా దాడి చేశారు. దీంతో ప్రశాంత్ ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఈ ఘటనపై ప్రశాంత్ సోదరుడు పంకజ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అనిల్ ఆచూకీ కోసం గాలిస్తున్నారు.