సోనియాకు లేఖ రాసిన కురియన్
న్యూఢిల్లీ : సూర్యనెల్లి సామూహిక అత్యాచారం కేసుకు సంబంధించి తాజాగా చోటుచేసుకున్న పరిస్థితుల నేపథ్యంలో రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ పి. జె. కురియన్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి, రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీకి లేఖ రాశారు. తన పరిస్థితి గురించి, తన రాజీనామాకై ప్రతిపక్షాల డిమాండు గురించి ఆయన ఈ లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. అయితే అది తమ పార్టీ అంతర్గత వ్యవహారమని, తాను లేఖలో ఏం రాసిందీ బహిర్గతం చేయలేనని కురియన్ పేర్కొన్నారు.