సోషల్ విూడియా దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయండిః సుప్రీం
న్యూఢిల్లీ,సెప్టెంబర్24 జనం సాక్షి : పెరిగిపోతున్న సోషల్ విూడియా దుర్వినియోగాన్ని అరికట్టేందుకు చట్టబద్ధమైన మార్గదర్శకాలను రూపొందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఆ మార్గదర్శకాలపై మూడో వారాల్లోగా అఫిడవిట్ ను దాఖలు చేయాలని పేర్కొంది.
సోషల్ విూడియాకు సంబంధించి హైకోర్టులు కానీ, సుప్రీంకోర్టు కాని ఒక విధానాన్ని రూపొందించలేవని, అది ప్రభుత్వం చేయాల్సిన పని అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ప్రభుత్వం వెంటనే దీనికి సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఆన్ లైన్ లో జరిగే మోసాలను, నేరాలను ట్రాక్ చేసేందుకు, వాటిని అరికట్టేందుకు సరైన టెక్నాలజీ లేదని సాకులు చెప్పొద్దని సుప్రీం ప్రభుత్వానికి సూచించింది. అలాంటి నేరాలు చేసే టెక్నాలజీ ఉందంటే.. దాన్ని అడ్డుకునే టెక్నాలజీ కూడా ఉండే ఉంటుంది కదా అంటూ కేంద్రానికి చురకలంటించింది.