హంతకులకు ఉరిశిక్ష విధించాలి

న్యూఢిల్లీ : ఢిల్లీ సామూహిక అత్యాచారం ఘటనలో హంతకులకు ఉరిశిక్ష పడాలని మరణించిన బాదితురాలి స్నేహితుడు కోరారు. న్యూఢిల్లీలో ప్రైవేటుబస్సులో ఆమెతో పాటు ఆమె స్నేహితుడు ఎక్కగా దుండగులు అతన్ని తీవ్రంగా గాయపర్చి యువతిపై అత్యాచారం చేసిన విషయం తెలిసిందే.