హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పంద కుంభకోణం

న్యూఢిల్లీ : హెలికాఫ్టర్ల కొనుగోలు ఒప్పంద కుంభకోణం కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ కేసులో మాజీ ఎయిర్‌చీఫ్‌ త్యాగిపై సీబీఐ కేసు నమోదు చేసింది. త్యాగి సహా మాజీ కేంద్ర మంత్రి సంతోష్‌ బగ్రోడియా తమ్ముడు సతీష్‌ పై కూడా కేసు నమోదయింది. మరోవైపు ఈ కుంభకోణానికి సంబంధించి ఢిల్లీ, గుర్గావ్‌, చండీగఢ్‌ సహా దేశవ్యాప్తంగా 12 చోట్ల సీబీఐ తనిఖీలు చేపట్టింది.