్డకేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ జ్యూరికి విద్యాబాలన్‌ ఎంపిక

న్యూడిల్లీ:ప్రఖ్యాత కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ జ్యూరీ సభ్యురాలిగా బాలీవుడ్‌ నటి విద్యాబాలన్‌ ఎంపికైంది.ప్రతిష్టాత్మక 66వ ‘కేన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌-2013’ లోజ్యూరీ మెంబర్‌గా ఆమె పాల్గొననున్నారు. కేన్స్‌ జూర్యీలో విద్యాబాలన్‌లతో పాటు ‘లైఫ్‌ ఆఫ్‌ పై’ దర్శకులు యాంగ్‌లీ కూడా పాల్గొననున్నారు.హలీవుడ్‌ దర్శకుడు స్టీవెన్‌ స్పిల్‌ బర్గ్‌ అధ్యక్షుతన తొమ్మిదిమంది సభ్యులుండే ఈ జ్యూరీలో జపనీస్‌ దర్శకుడు నవోమి కవాసే, నటి, నిర్మాత నికోల్‌ కిడ్‌ మన్‌, స్కాటిష్‌ దర్శకుడు లిన్నే రమ్సే,  ఫ్రెంచ్‌ నటుడు, దర్శకుడు డానియేల్‌, రుమేనియన్‌ దర్శకుడు క్రిస్టియన్‌ ముంగి, నటుడు క్రిస్ట్ఫో వాల్ట్జ్‌ సభ్యులుగా ఉన్నారు.
ఇప్పడీ జాబితాలో విద్యా కూడా చేరింది. మే15 నుంచి 26 వరకు కేన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌ జరగనుంది. డర్టీ పిక్చర్‌, కహనీ, పరిణిత చిత్రాల్లో అసాధారణ నటన తో విద్యాబాలన్‌ ప్రేక్షకుల్ని అలరించిన విషయం తెలిసిందే. డర్టీ పిక్చర్‌ చిత్రంలో ఆమె నటనకు జాతీయ అవార్డు లభించింది.