13 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం

ముంబయి, జనంసాక్షి: 13 ఏళ్ల బాలిక ముంబయిలో సామూహిక అత్యాచారానికి గురైంది. నగరంలోని శాంతాక్రజ్‌ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన ఆమె స్నేహితురాలే సహకరించింది. తన స్నేహితురాలు నిన్న రాత్రి తన ఇంటికి ఆహ్వానించిందని, అనంతరం మత్తు మందు కలిపిన పానీయాన్ని ఇచ్చిందని బాలిక పోలీసులకు తెలిపింది. అప్పటికే ఇంటిలో ఉన్న నలుగురు యువకులు తనపై అత్యాచారానికి పాల్పడినట్లు చెప్పింది. పోలీసులు కేసు నమోదు చేసి బాలికను ఆసుపత్రికి తరలించారు.