18న లంబాడాల ‘చలో హైదరాబాద్‌’

హైదరాబాద్‌: తండాలను గ్రామ పంచాయతీలుగా గుర్తించాలని, తండాల సమగ్ర గ్రామీణాభివృద్ధికి రూ. ఐదు కోట్ల రూపాయాల ప్యాకేజీ ఇవ్వాలని, తెలంగాణ బిల్లును పార్లమెంట్‌లో పెట్టాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 18న నగరంలో ‘చలో హైదరాబాద్‌’,’లండాడ లడాయి’ కార్యక్రమాలు నర్వహిస్తున్నామని తెలంగాణ లంబాడ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు కిషన్‌నాయక్‌ ఒక ప్రకటనలో తెలిపారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ రాష్ట్ర మహాసభ నిర్వహిస్తున్నామని తెలియజేశారు.