2 గంటలకు వాయిదా వేసిన రాజ్యసభ

న్యూఢిల్లీ : విపక్షాల ఆందోళనతో రాజ్యసభలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఈ ఉదయం ఒకసారి వాయిదా అనంతరం రాజ్యసభ తిరిగి ప్రారంభం కాగానే 2జీ, బొగ్గుకుంభకోణం వ్యవహారాలపై విపక్షాలు ఆందోళనకు దిగాయి. దీంతో ఛైర్మన్‌ సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు.