20న ప్రధాని మన్మోహన్‌సింగ్‌ నివాసం ఎదుట ధర్నా: బీజేపీ

న్యూఢిల్లీ : తాము హిందూ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నామని కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే చేసి వ్యాఖ్యలకు నిరసనగా ఈ నెల 20న ప్రధాని మన్మోహన్‌సింగ్‌ నివాసం ఎదుట ధర్నా చేయనున్నామని బీజేపీ అధికార ప్రతినిధి ముక్తార్‌ అబ్బాస్‌ నక్వీ వెల్లడించారు. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ వ్యాఖ్యలను వీహెచ్‌పీ నేత ప్రవీణ్‌ తొగాడియా వ్యాఖ్యలతో పోల్పలేమని అన్నారు.