22 అంశాల నివేదన

– వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి రూ. రూ.450 కోట్లు ఇవ్వండి
– రిజర్వేషన్‌ పెంచండి
– ప్రధాని మోడీతో సీఎం కేసీఆర్‌ భేటీ
– కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతోనూ సమావేశమైన ముఖ్యమంత్రి
న్యూఢిల్లీ,అక్టోబర్‌ 4(జనంసాక్షి): హస్తిన పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్‌.. ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అయ్యారు. సుమారు అరగంటకు పైగా ప్రధానితో సమావేశమై చర్చలు జరిపారు. తెలుగు రాష్టాల్ర మధ్య గోదావరి, కృష్ణా నదుల అనుసంధానం ప్రాజెక్టు సంబంధించిన అంశంపై ప్రధానితో కేసీఆర్‌ చర్చించినట్లు సమాచారం. దీనికి కేంద్రం సహకారం అందించాలని కోరినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని ఏదైనా ఒక ప్రాజెక్టుకు జాతీయ ¬దాతో పాటు మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ పథకాలకు నిధుల కేటాయింపు, పెండింగ్‌లో ఉన్న విభజన హావిూల పరిష్కారానికి చొరవ తీసుకోవాలని మోదీని కేసీఆర్‌ కోరినట్లు సమాచారం. ప్రధానిగా మోదీ రెండోసారి పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయనతో కేసీఆర్‌ భేటీ కావడం ఇదే తొలిసారి. 22 అంశాలకు సంబంధించిన లేఖలను మోదీకి కేసీఆర్‌ అందజేశారు. ప్రధానిగా మోదీ రెండోసారి పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయనతో కేసీఆర్‌ భేటీ కావడం ఇదే తొలిసారి.  అంతకుముందు కేంద్ర ¬ంశాఖ మంత్రి అమిత్‌షాతో కేసీఆర్‌ భేటీ అయ్యారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా మరికొందరు కేంద్రమంత్రులతోనూ ఆయన సమావేశం కానున్నారు.
నివేదించిన అంశాల వివరాలు
ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన బిల్లు ప్రకారం తెలంగాణలోని వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ఏటా రూ. 450 కోట్లు కేంద్రం రాష్ట్రానికి ఇవ్వాల్సి ఉంది. గత ఐదేళ్లలో నాలుగు సార్లు విడుదలైనప్పటికీ.. ఒక ఏడాదికి సంబంధించిన నిధులు ఇంకా విడుదల కాలేదు. ఆ నిధులు వెంటనే విడుదల చేయాలి. నేషనల్‌ హైవేస్‌ అథారిటీ సహకారంతో ఆదిలాబాద్‌ జిల్లాలో సిమెంటు కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా పరిశ్రమను పునరుద్ధరించాలి. తెలంగాణ హైకోర్టులో జడ్జిల సంఖ్యను 24 నుంచి 42కు పెంచాలి. రాష్ట్రంలో ఐఐఎం నెలకొల్పాలి. తెలంగాణకు ఇండియన్‌ ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (ఐఐఎస్‌ఈఆర్‌) మంజూరు చేయాలి.హైదరాబాద్లో నేషనల్‌ ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌ (ఎస్‌ఐడీ)ఏర్పాటు చేయాలి. అన్ని జిల్లాల్లో నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయాలనే నిర్ణయం మేరకు రాష్ట్రంలో మరో 23 నవోదయ పాఠశాలలు ఏర్పాటు చేయాలి. రాష్ట్రంలో పెండింగ్‌ రైల్వే ప్రాజెక్టులను పూర్తిచేయాలి. రైల్వే పనులకు అవసరమైన నిధులు విడుదల చేయాలి. నీతి ఆయోగ్‌ సిఫార్సులకు అనుగుణంగా మిషన్‌ కాకతీయ పథకానికి రూ.5 వేల కోట్లు, మిషన్‌ భగీరథకు రూ.19,205 కోట్లు విడుదల చేయాలి. బయ్యారంలో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయాలి  జహీరాబాద్‌ నిమ్స్‌ కు నిధులు విడుదల చేయాలి. తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసిన మేరకు రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ చేపట్టాలి. పీపీపీ పద్ధతిలో కరీంనగర్‌లో ఐఐఐటీ నెలకొల్పాలి తెలంగాణలో రిజర్వేషన్లు పెంచాలి. ముస్లింలలోని వెనుకబడిన కులాలకు 12 శాతం రిజర్వేషన్లతో కలపి మొత్తం బిసిలకు 37 శాతం, ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలి. పార్లమెంటు, అసెంబ్లీలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలి. ఈ విషయంలో ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసింది.. హైదరాబాద్‌ – నాగపుర్‌, వరంగల్‌ -హైదరాబాద్‌ ఇండస్ట్రియల్‌ కారిడార్‌ ను అభివృద్ధి చేయాలి. వెనుకబడిన ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధి కోసం సీఎంజీఎస్సె ద్వారా రూ. 4వేల కోట్లు కేటాయించాలి. వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టే రహదారుల పనులకు 60 : 40 నిష్పత్తిలో కాకుండా వందశాతం ఖర్చును కేంద్ర ప్రభుత్వమే భరించాలి.. సెంట్రల్‌ యూనివర్సిటీ తరహాలో పూర్తి కేంద్ర ఖర్చుతో వరంగల్‌ లో గిరిజన యూనివర్సిటీ నెలకొల్పాలి. వరంగల్‌ టెక్స్‌ టైల్‌ పార్కు కోసం రూ.వెయ్యి కోట్లను గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ గా అందించాలి. రామప్ప దేవాలయాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించాలి. అనంతరం రక్షణ శాఖ మంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్‌ తో కేసీఆర్‌ భేటీ అయ్యారు. రాజీవ్‌ రహదారి విస్తరణకు కంటోన్మెంట్‌ భూములను అప్పగించాలని కేసీఆర్‌ రాజ్‌ నాథ్‌ ను కోరారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా మరికొందరు కేంద్రమంత్రులతోనూ ఆయన సమావేశం కానున్నారు.
అమిత్‌షాతో సిఎం కెసిఆర్‌ బేటీ
నీళ్లు, నిధుల అంశాలే ప్రధాన ఎజెండాగా ఢిల్లీ పర్యటనకు వెళ్ళిన తెలంగాణ సీఎం కేసీఆర్‌ కేంద్ర ¬ంశాఖ మంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు. రాష్టాన్రికి సంబంధించి విభజన సమస్యలతో పాటు, పలు అంశాలపై చర్చించినట్లు కేసీఆర్‌ విూడియాతో వివరించారు. ఆంధ్రప్రదేశ్‌తో కలసి సంయుక్తంగా నిర్మించతలపెట్టిన కృష్ణా – గోదావరి నదుల అనుసంధానం ప్రాజెక్టుకు సంబంధించిన విషయాలపై కూడా చర్చించినట్లు తెలిపారు. అదేవిధంగా కాళేశ్వరం, పాలమూరు,రంగారెడ్డి ప్రాజెక్టుల్లో ఒకదానికి జాతీయ ప్రాజెక్టు ¬దా తమకు ఎప్పటికీ ప్రాధాన్య అంశమేనని కేసీఆర్‌ తేల్చి చెప్పారు. ఈ భేటీ అమిత్‌ షా, కేసీఆర్‌ల మధ్య దాదాపు 40 నిమిషాలపాటు కొనసాగింది. గోదావరి-కృష్ణా నదుల అనుసంధానంపై ఈ సమావేశంలో చర్చిస్తారు. రెండు జీవనదుల అనుసంధానం జరిగితే తెలుగు రాష్టాల్లోన్రి బీడు భూములన్నింటికీ సాగునీరు అందించే అవకాశం ఉండటంతో.. అతి కీలకమైన ఈ ప్రాజెక్టుకు ఆర్థిక సహాయం అందించాలని సీఎం కేసీఆర్‌ ప్రధానిని కోరే అవకాశం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ ¬దా ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ స్వయంగా ప్రధానిని చాలాసార్లు కోరినప్పటికీ ఇవ్వలేదు. తాజాగా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కూడా ఉండటంతో ఈ రెండింటిలో ఒకదానికి జాతీయ ¬దా ఇవ్వాలని కోరనున్నారు. రాష్ట్రంలో హైవేల విస్తరణపై కూడా చర్చిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం రీజినల్‌ రింగ్‌రోడ్‌పై ఇప్పటికే డీపీఆర్‌ను కేంద్రానికి సమర్పించింది. కంటోన్మెంట్‌ ప్రాంతాల్లో రోడ్ల విస్తరణకు రక్షణశాఖకు చెందిన భూములను ఇవ్వాలని ప్రధానిని సిఎం కోరనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికీ మంచినీటి కోసం మిషన్‌ భగీరథ పథకాన్ని తీసుకువచ్చిన తర్వాతే.. కేంద్రం ఘర్‌ఘర్‌ జల్‌ అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. కేంద్ర పథకానికి మిషన్‌ భగీరథను అనుసంధానం చేయాలని సీఎం ప్రధానిని కోరనున్నట్టు సమాచారం. వెనుకబడిన జిల్లాలకు ఆర్థిక సాయాన్ని అందించే అంశంపైనా ప్రధానితో సిఎం మాట్లాడనున్నట్లు సమాచారం.