75 మంది విద్యార్ధులకు తప్పిన ముప్పు

వికారాబాద్ : బార్వాద్ – మోత్కుపల్లి నుంచి వికారాబాద్ వస్తున్న ఆర్టీసీ బస్సు మదనపల్లి సమీపంలోని అదుపుతప్పి రోడ్డు పక్కన గుంతలోకి దూసుతీసుకెళ్లింది. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో 75 మంది విద్యార్థులకు పెనుప్రమాదం తప్పింది. వికారాబాద్ నుంచి ప్రతి గ్రామానికి వెళ్లాల్సిన రోడ్లు అధ్వానంగా ఉండడంతోనే నిత్యం ఎక్కడో ఒకచోట ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అయినప్పటికీ స్థానిక అధికారులు, నాయకులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు మండిపడుతున్నారు.