25 ఏళ్ల మహిళపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారం

న్యూఢిల్లీ : దేశ రాజధానిలో మహిళలపై అకృత్యాలు కొనసాగుతున్నాయి. దక్షిణ ఢిల్లీలో 25 ఏళ్ల మహిళపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. న్యూఫ్రెండ్స్‌ కాలనీలో చోటుచేసుకున్న ఈ ఘటన బాధితురాలు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు.