న్యూఢిల్లీ : దేశరాజధానిలోని మంగోల్‌ ప్రాంతంలోని ఓ పాదరక్షల పరిశ్రమలో ఈ ఉదయం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మంటల్లో చిక్కుకుని నలుగురు కార్మికులు సజీవ దహనమయారు. ఘటనాస్థలనికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడనికి శ్రమిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.