ఆర్థిక మంత్రితో దువ్వూరి భేటీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరంతో రిజర్వ్‌బ్యాంకు గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు భేటీ అయ్యారు. ఈ నెల 30న ఆర్‌బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్ష జరుపనున్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది.