ప్రారంభమైన కౌంటింగ్
హైదరాబాద్,(జనంసాక్షి): రాష్ట్రంలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ సంబంధించి కౌంటింగ్ మధ్యాహ్నం రెండుగంటలకు మొదలైంది. మొదట వార్డు మెంబర్ల ఓట్లను లెక్కిస్తారు. అనంతరం సర్పంచ్ ఓట్లను లెక్కించి సాయంత్రానికల్లా ఫలితాలను అధికారులు ప్రకటిస్తారు.