భారత విదేశాంగ శాఖ కార్యదర్శిగా సుజాతా సింగ్‌ నియామకం

న్యూఢిల్లీ,(జనంసాక్షి): భారత విదేశాంగ శాఖ కార్యదర్శిగా కొత్తగా నియమితులైన సుజాతా సింగ్‌ ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. 1976 ఐఎఫ్‌ఎస్‌ బ్యాచ్‌కు చెందిన సుజాత గతంలో జర్మనీలో భాతర రాయబారిగా పనిచేశారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమె మాట్లాడుతూ పొరుగుదేశాలతో శాంతియుతంగా సంబంధాలు నెలకొల్పడమే తన ప్రథమ ప్రధాన్యమని పేర్కొన్నారు.