బంగారం, వెండి, ప్లాటినంపై సుంకం పెంపు

ఢిల్లీ,(జనంసాక్షి): బంగారం, వెండి, ప్లాటినం కొనాలనుకునేవారికి చేదువార్త. కేంద్ర ప్రభుత్వం ఈ లోహాలపై దిగుమతి సుంకం 10 శాతం  పెంచాలని నిర్ణయించింది. దిగుమతి సుంకం పెంపు వల్ల ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 4,830 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఆర్జిస్తుందని అంచనా.