71లక్షల మందికి బీమా సౌకర్యం

విత్తనం వేసిన నాటినుంచే పంటలకు రక్షణ

వ్యవసాయ రంగంపై చర్చలో మంత్రి కురసాల కన్నబాబు

అమరావతి,నవంబర్‌19(జనం సాక్షి  ) : రైతు విత్తనం వేసిన దగ్గర్నుంచే బీమా సౌకర్యం కల్పిస్తున్నామని, ఈ పక్రియలో 71లక్షల మంది రైతులకు బీమా సౌకర్యం కల్పించినట్లు  ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ రెండవ రోజు సమావేశాల్లో  వ్యవసాయ రంగంపై చర్చ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు  తెలిపారు. టీడీపీ ఐదేళ్లలో చేసిన బీమా కన్నా రెట్టింపు బీమ చేయించామని తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వం ఏనాడు రైతులకు పూర్తి సబ్సిడీ ఇవ్వలేదని గుర్తు చేస్తూ, రైతుల కోసం టీడీపీ నేతలు ఏనాడైనా ఒక్క సలహానైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. అసలు రైతులు గురించి మాట్లాడే నైతిక హక్కు టీడీపీకి లేదని ధ్వజమెత్తారు. హోం మంత్రి అమిత్‌ షా తిరుపతికి వస్తే రాళ్లు వేయించిన చంద్రబాబు, ఢల్లీికి వెళ్లినప్పుడు ఆయన కాళ్లు పట్టుకున్నాడు.. అసలు చంద్రబాబు గురించి మాట్లాడితే ఏడాది పాటు సభ పెట్టినా సరిపోదని విమర్శించారు. మంగళగిరిలో లోకేష్‌ ఓటమిని తట్టుకున్న గుండె చంద్రబాబుది, కుప్పంలోనూ ఓటమి ఆయనకు లెక్కకాదని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసే దమ్ము చంద్రబాబుకు ఉందా అని మంత్రి ప్రశ్నించారు. చర్చలో భాగంగా మంత్రి కన్నబాబు హెరిటేజ్‌ సంస్థను ప్రస్తావనకు తీసుకువచ్చారు. ప్రభుత్వ లోన్లతో గేదెలను కొనుగోలు చేసిన రైతులు….హెరిటేజ్‌కే పాలు విక్రయించాలని గతంలో ఆదేశాలు ఇచ్చారని మంత్రి తెలిపారు. రైతుల గురించి మాట్లాడితే తనపై పరువు నష్టం కేసు వేశారని కన్నబాబు అన్నారు. అయితే కన్నబాబు వ్యాఖ్యలపై చంద్రబాబు, టీడీపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.  మంత్రి ఆరోపణలపై వివరణకు అవకాశం ఇవ్వాలని టీడీపీ కోరింది. కాగా…విూకు అవకాశం వచ్చినప్పుడు సమాధానం చెప్పుకోవాలని స్పీకర్‌ స్పష్టం చేశారు. అలాగే మంత్రి అప్పలరాజు స్పీచ్‌పైనా టీడీపీ అభ్యంతరం తెలిపింది. సంబంధం లేని అంశాలపై మాట్లాడేందుకు మంత్రికి అవకాశం ఎలా ఇస్తారని టీడీపీ అసంతృప్తి వ్యక్తం చేసింది. వ్యవసాయ రంగంపై మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం.. రైతుల సంక్షేమం కోసం రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసిందన్నారు. కుప్పంలో ఓటమితో చంద్రబాబు.. మైండ్‌బ్లాక్‌ అయ్యిందని అన్నారు. టీడీపీ సభ్యులు.. ప్రీ ఎª`లాన్‌ ప్రకారం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని కురసాల కన్నబాబు మండిపడ్డారు.