పార్లమెంటు ఉభయ సభలు రేపటికి వాయిదా

ఢిల్లీ: పార్లమెంటు ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ నినాదాలతో ఇవాళ ఉభయ సభలు మార్మోగాయి. ఉదయం రెండు సార్లు వాయిదా పడి తిరిగి రెండు గంటలకు ప్రారంభం కాగా లోక్‌సభలో సీమాంధ్ర కాంగ్రెస్‌ ఎంపీలు స్పీకర్‌కు యూపీఏ ప్రభుత్వం పై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చారు. అనంతరం సభ రేపటికి వాయిదా పడింది. రాజ్యసభ కూడా రేపటికి వాయిదా పడింది.