మణిపూర్-నాగాలాండ్ సరిహద్దులో భూకంపం

న్యూఢిల్లీ: మణిపూర్, నాగాలాండ్ రాష్ట్రాల సరిహద్దుల్లో ఈ మధ్యాహ్నం స్పల్ప భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.4గా నమోదైందని అధికారులు తెలిపారు. నాగాలాండ్ రాజధాని కోహిమాకు 14 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం కేంద్రీకృతమైనట్లు వారు పేర్కొన్నారు.