9శాతం వృద్ధిరేటు సాధించడమే అసలు సవాలు : చిదంబరం

న్యూఢిల్లీ: 9 శాతం వృద్ధిరేటు సాధించడం దేశ ముందున్న అతి పెద్ద సవాలు అని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి పి. చిదంబరం అన్నారు. పార్లమెంట్‌లో బడ్జెట్‌ ప్రసంగం చేసిన 2013-14లో చైనా మాత్రమే అధిక వృద్ధి రేటు నమోదు చేసిందన్నారు. ఆర్థిక వృద్ధిరేటు, సమ్మిళత అభివృద్ధే తమ ప్రధాన అజెండాగా పేర్కొన్నారు. ప్రపంచ వృద్ధిరేటు మందగమనంలో ఉందన్న ఆయన మందగమనం వల్ల మన ఎగుమతులు ఒడిదొడుకుల్లో ఉన్నాయన్నారు.