కాంగ్రెస్ లో చేరిన ముగ్గురు బి ఆర్ ఎస్ కార్పొరేటర్లు

వరంగల్ ఈస్ట్, ఆగస్టు 01(జనం సాక్షివరంగల్ తూర్పు నియోజకవర్గం లోని ముగ్గురు బి ఆర్ ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్లో చేరారు.ఈ మేరకు గురువారం మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి ఓ సిటీ క్యాంప్ అఫిస్ లో కాంగ్రెస్ పార్టీ కండువాలుకప్పిపార్టీలోకఆహ్వానించారు.కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో కార్పొరేటర్లు సోమిశెట్టి ప్రవీణ్, పల్లం పద్మ రవి, భోగి సువర్ణ సురేష్ ఉన్నారు. ఈ కార్యక్రమంలో కిలా వరంగల్ పిఎసిఎస్ చైర్మన్ కెడల జనార్ధన్, కాంగ్రెస్ నాయకులు గోపాల నవీన్ రాజ్, మాజీ కార్పొరేటర్ కెడల పద్మ తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.