అత్యంత గోప్యంగా ఉరిశిక్ష ప్రక్రియ పూర్తి
న్యూఢిల్లీ: ముంబయి దాడుల ఘటనలో అజ్మల్ కసబ్ను ఉరి తీసిన విధంగానే పార్లమెంట్పై దాడి కేసులో కీలక దోషి అఫ్జల్గురుకు కూడా అత్యంత రహస్యంగా ఉరిశిక్ష ప్రక్రియను పూర్తిచేశారు. రాష్ట్రపతి క్షమాభిక్ష తిరస్కరణ నుంచి ఉరిశిక్ష అమలు వరకూ కేంద్ర హోంశాఖ అన్ని విషయాలను అత్యంత గోప్యంగా ఉంచింది. ఈ ఉదయం తీహర్ జైల్లో ఉరి అమలు అనంతరం మీడియాకు విషయాన్ని వెల్లడించింది.