అత్యాచార ఘటనపై చర్చకు బీజేపీ పట్టు

న్యూఢిల్లీ : దేశ రాజధానిలో యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటనపై పార్లమెంటులో చర్చ జరపాలని  భాజాపా నిర్ణయించింది. రాజ్యసభలో ప్రశ్నోత్తరాలు రద్దు చేసి అత్యాచార ఘటనపై చర్చ చేపట్టాలని భాజపా సభ్యులు నోటీసులు  ఇచ్చి నిరసనకు దిగారు. సభ్యులు శాంతించకపోవడంతో  సభకు 15 నిమిషాలపాటు చైర్మన్‌ వాయిదా వేశారు. దక్షిణ ఢిల్లీలో ఆదివారం రాత్రి ఓ ప్రైవేటు బస్సులో వైద్య విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడి అనంతరం బస్సు నుంచి ఆమెను, ఆమె స్నేహితున్ని దుండగులు తోసేశారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని పో లీసులు అరెస్టు చేశారు.