అఫ్ఘాన్‌లో భూకంపం..13 మంది మృతి

భారత్‌,పాక్‌లోనూ ప్రకంపనలు

కాబూల్‌/ఇస్లామాబాద్‌/న్యూఢిల్లీ,ఏప్రిల్‌ 24: ఉత్తర అష్ఘానిస్థాన్‌,ఉత్తరభారతం,పాకిస్థాన్‌,పపువా న్యూగినియాలలో బుధవారం కొద్ది క్షణాలపాటు భూమి కంపించింది.అఫ్ఘాన్‌లో భూకంప ధాటికి 13 మంది మృతిచెందారు.దేశ రాజధాని ఢిల్లీ,గుర్గావ్‌,నోయిడాలతోపాటు శ్రీనగర్‌ వరకు భూకంప ప్రభావం కనిపించింది.రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 5.7గా నమోదైంది.ఇక పాకిస్థాన్‌లో భూకంప తీవ్రత 6.2 గా,పపువా న్యూగినియాలో 6.4 గా నమోదైంది.