అమెరికాలో రెడ్డు ప్రమాదం: 5గురు తెలుగు యువకులు మృతి

అమెరికా: ఓక్లాహామా నగరంలో ఈ రోజుజరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 5 గురు తెలుగు యువకులు మృతి చెందారు. మృతులను జశ్వంత్‌ రెడ్డి, ఫణీంద్ర గద్దె, అనురాగ్‌ అంతటి, శ్రీనివాస్‌ రవి, వెంకట్‌గా గుర్తించారు. వీరంతా హైదరాబాద్‌కు చెందిన వారిగా ప్రాధమిక సమాచారం సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లుగా వీరు పని చేస్తున్నారు. ఇందులో వెంకట్‌కు వివాహమైంది. వీరు ప్రయాణిస్తున్న కారు పెద్ద రిగ్‌ను గుద్దు కోవడంతో మంటలు లేచాయి. అందులో వీరు చిక్కుకుని మరణించారని పోలీసులు తెలిపారు. తానా సభ్యులు వెంటనే సహయక చర్యలు చేపట్టారు. మృత దేహలను భారత్‌కు పంపేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తానా అధ్యక్షుడు ప్రసాద్‌ తోటకూర తెలిపారు.