అహ్లువాలియాని కలిసిన తెదేపా ఎంపీల బృందం

న్యూఢిల్లీ: తెలుగు దేశం పార్టీ ఎంపీల బృందం నేడు నామా నాగేశ్వరరావు నేతృత్వంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్‌ సింగ్‌ అహ్లువాలియాను కలిసింది. మైనారిటీ సంక్షేమ కోసం 12వ ప్రణాళికలో రూ. 59 వేల కోట్లు కేటాయించాలని తెదేపా ఎంపీలు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడికి విజ్ఞప్తి చేశారు.