ఆజాద్‌ను కలిసిన ”సీఎం”

న్యూఢిల్లీ : సీఎం కిరణ్‌కూమార్‌ రెడ్డి శనివారం రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహరాల ఇన్‌చార్జ్‌ గులాం నబీ ఆజాద్‌ను కలిశారు. హైకమాండ్‌ పిలుపు మేరకు ఆయన ఈరోజు ఉదయం హస్తిన పయనం అయిన విషయం తెలిసిందే. పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో కూడా సీఎం భేటీ కానున్నట్లు సమాచారం. ఇప్పటికే ఢిల్లీలో మకాం వేసిన రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ ఈరోజు సాయంత్రం సోనియాతో సమావేశం కానున్నారు..