ఆ వ్యాఖ్యలపై షిండే విచారం

ఢిల్లీ ,ఫిబ్రవరి 20 (జనంసాక్షి) :
తాను చేసిన కాషాయ తీవ్రవాదం వ్యాఖ్యలపై కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే వెనక్కి తగ్గారు. తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేశారు. జైపూర్‌లో ఇటీవల తాను చేసిన వ్యాఖ్యలు అపోహలకు దారితీశాయని ఆయన పేర్కొన్నారు. ఏ మతానికి తీవ్రవాదం రంగు పులిమే ఉద్దశం తనకు లేదని తెలిపారు. తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెబుతున్నట్లు ప్రకటించారు. కాగా, షిండే వ్యాఖ్యలపై పార్లమెంట్‌లో చర్చకు పట్టుబ డుతామని బీజేపీ హెచ్చ రించడంతో ఆయన వెనక్కి తగ్గాల్సి వచ్చింది.