ఇండియా గేట్‌ వద్ద కొనసాగుతున్న ఆందోళన

న్యూఢిల్లీ: వైద్య విద్యార్ధినిపై అత్యాచార ఘటనను నిరిసిస్తూ ఇండియా గేట్‌ వద్ద విద్యార్థులు ఈ ఉదయం చేపట్టిన ఆందోళన కొనసాగుతొంది. భారీ సంఖ్యలో అక్కడికి  చేరుకున్న విద్యార్థులు రాష్ట్రపతి భవన్‌ ముట్టడికి యత్నించారు. పోలీసులు బాష్ప వాయువు గోళాలు, జలఫిరంగులు ప్రయోగించి అడ్డుకునే ప్రయత్నంచేసినప్పటికీ విద్యార్థులు వెనక్కుతగ్గడం లేదు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు  అక్కడికి చేరుకుంటుండంతో వారిని అడ్డుకోవడం పోలీసులకు కష్టతరమవుతోంది. దీంతో అందోళనకారులపై మరోసారి జల ఫిరంగులు, బాష్పవాయువు ప్రయోగించి పోలీసులు లాఠీఛార్జికి దిగారు. ఈ ఘటనలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. వీరిని సమీప ఆసుపత్రికి తరలించారు.