ఉత్తర జపాన్‌లో సునామీ

సుమారు 20 సెంటీమీటర్ల ఎత్తు వరకు సముద్రపు అలలు

హైదరాబాద్‌: ఉత్తర జపాన్‌లో చిన్నపాటి సునామీ సంభవించింది. సుమారు 20 సెంటీమీటర్ల ఎత్తు వరకు సముద్రపు అలలు ఎగిసిపడ్డాయి. ముందుజాగ్రత్తగా 19వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నాలుగేళ్ల క్రితం ఇదే ప్రాంతంలో సంభవించిన సునామీ కారణంగా దాదాపు 18వేల మంది మృత్యువాత పడ్డారు. పుకుషిమా అణువిద్యుత్‌ కేంద్రం తీవ్రంగా దెబ్బతింది. మళ్లీ ఇదే ప్రాంతంలో సునామీ రావడంతో ఉత్తర జపాన్‌ వాసులు భయాందోళనకు గురయ్యారు.