ఉపాధ్యక్షుడి కుమారుడు మృతి

వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్షుడు జో బిడెన్ కుమారుడు బ్యూ బిడెన్ (46) మృతి చెందాడు. గత కొద్ది రోజులుగా క్యాన్సర్తో బాధపడుతున్న అతడు శనివారం చనిపోయాడని అమెరికా వైట్ హౌస్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఘటనపై జో బిడెన్ మాట్లాడుతూ బ్రెయిన్ డెడ్తో గత కొద్ది కాలంగా బాధపడుతున్న నాకుమారుడు చివరికి మా అందరి హృదయాలను బాధపెట్టి వెళ్లిపోయాడు. అయినా అతడి ఆత్మ మా మధ్యనే ఉంటుంది. క్యాన్సర్ జయించడానికి అతడు ప్రతి రోజూ ఒక క్రమపద్ధతిలో జీవించేందుకు చాలా ధైర్యంగా పోరాడాడు. ఈ విషయంలో అతడి భార్య కూడా ఎంతో ధైర్యంగా అతడికి అండగా ఉంది’ అని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.