ఓల్గానదిలో రెండు పడవలు ఢీ: 11మంది మృతి

మాస్కో,జూన్‌12(జ‌నం సాక్షి ):రష్యాలోని ఓల్గా నదిలో రెండు పడవలు ప్రమాదశాత్తు ఢీకొన్నాయి. 16 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవ ఎదురుగా ఉన్న మరో పడవ వైపు వేగంగా దూసుకెళ్లింది. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. సమాచారమందుకున్న అత్యవసర విభాగం సిబ్బంది ఓల్గా నది వద్దకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టి ఐదుగురిని సురక్షితంగా కాపాడారు. వీరిలో ముగ్గురిని ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. సహాయక చర్యలు ముగిశాయని, ఈ ప్రమాదంలో మొత్తం 11 మంది ప్రయాణికులు చనిపోయారని స్థానిక అత్యవసర విభాగం అధికార ప్రతినిధి ఒకరు విూడియాకు వెల్లడించారు.