కాంబోడియాలో రోడ్డు ప్రమాదం: 16మంది దుర్మరణం

హైదరాబాద్‌: రోడ్డు ప్రమాదంలో వస్త్ర పరిశ్రమలో పనిచేసే 16మంది కార్మికులు మృతిచెందిన ఘటన కాంబోడియా రాజధాని నాంఫెన్‌లో చోటుచేసుకుంది. కాంబోడియాలోని ప్రే నొకోర్‌ వైపు ప్రయాణిస్తున్న బస్సు కారుని ఓవర్‌టేక్‌ చేసి కార్మికులు ప్రయాణిస్తున్న వ్యాను పైకి దూసుకెళ్లడంతో ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. వ్యానులోని 38 మంది ప్రయాణికుల్లో 16మంది అక్కడికక్కడే మృతిచెందగా 22 మందికి తీవ్రగాయాలయ్యాయి. వారిలో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. బస్సు డ్రైవర్‌ను అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు తెలిపారు.