కేంద్ర వ్యవసాయశాఖ మంత్రితో ఏపీ బీజేపీ నేతల భేటి

ఢిల్లీ, మార్చి 18 : కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధామోహన్‌సింగ్‌ను ఆంధ్రా బీజేపీ నేతలు భేటి అయ్యారు. రాయలసీమలో కరవు పరిస్థితులను గురించి బీజేపీ నేతలు మంత్రికి వివరించారు. మార్చి 31 వతేదీ తర్వాత కేంద్ర అధికారుల బృందం రాయలసీమలో పర్యటిస్తుందని కేంద్రమంత్రి చెప్పారు. రైతులకు గడ్డి విత్తనాలు ఇస్తామని కేంద్రం చెప్పినా, రాష్ట్రప్రభుత్వం ముందుకు రాలేదని, ఈ విషయాన్ని ఏపీ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామని బీజేపీ నాయకురాలు పురందరేశ్వరీ చెప్పారు.