కొనసాగుతున్న ఉగ్రవాదుల ఏరివేత

పాకిస్థాన్‌లో తాజాగా 30 మంది హతం

పెషావర్‌: ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమాన్ని పాకిస్థాన్‌ కొనసాగిస్తూనే ఉంది. అఫ్ఘానిస్థాన్‌ సరిహద్దులోని గిరిజన ప్రాంతంలో ఉగ్రవాద శిబిరంపై బుధవారం పాకిస్థాన్‌ యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపించాయి. ఈ సంఘటనలో దాదాపు 30 మంది ఉగ్రవాదులు హతమవగా ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. మృతిచెందిన వారిలో కీలక వ్యక్తులు ఉన్నట్లు సమాచారం.